కరోనా ప్రభావం ప్రభుత్వ పన్నురాబడులపై తీవ్రంగా పడుతున్నది. దేశంలో వస్తు సేవల పన్ను (జీఎస్టీ) ప్రారంభమైన తర్వాత మొదటిసారి అతి తక్కువ నమోదైంది. ఫిబ్రవరి నెలలో జరిగిన దిగుమతులు, అమ్మకాలకు సంబందించిన జీఎస్టీ మార్చి నెలలో కేవలం రూ.18056 కోట్లు మాత్రమే వసూలైంది. గతంలో ఈ రంగంలో అతి తక్కువ జీఎస్టీ 2018 ఫిబ్రవరిలో రూ.19603 కోట్లు. తాజాగా ఆ రికార్డు మరింత దిగజారింది. వచ్చే రెండు మూడు నెలల్లో జీఎస్టీ మరింత తగ్గే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వ అధికారులు అంటున్నారు.
దిగజారుతున్న జీఎస్టీ